ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -1

                                                                                                                                  సేకరణ : శర్మ జి ఎస్ 
                                               రామాయణం లోని కొన్నిటికి వివరణలు . 
                                                                       
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) -
గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది)
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్నిపూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. గోకర్ణ,శివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది
11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తరప్రదేశ్
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13.అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు- శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16. దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు
17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక
20.శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక
21.హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి,కొప్పాళ,కర్ణాటక
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం-తుంగభద్ర నదీతీర ప్రాంతం,హంపి దగ్గర,కర్ణాటక
23.విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు
24.శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
25.రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక
26.అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
27.శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక
29.వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలోఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30.కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
31.లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32.తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33.పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) -పెషావర్, పాకిస్తాన్ .

గమనిక : ఈ ఎగువ ఉదహరించిన విషయాలు నాకు వాట్సప్ లో ఆదిపూడి వెంకటశివ సాయిరాం నుంచి లభ్యమైనవి .
అందరూ కాకున్నా కొంతమందైనా తెలుసుకుంటారన్న సద్భావనతో ఈ టపాలో పొందుపరచటం జరిగింది . 


4 comments:

  1. kalpanalu , nijalakante madhuram gaa untaayi

    ReplyDelete
    Replies
    1. మదన మోహన రెడ్డి గారూ ,

      ముందుగా మీకు నా బ్లాగు తరఫున స్వాగతం .

      మీరన్నట్లు కల్పనలు నిజానికంటే చాలా చాలా అందంగా వుంటాయి . అందుకే గదా ఈ కవులు , రచయితలు పుట్టుకొచ్చినది .

      అయితే మీరీ కోణంలో నుంచి చూడండి .

      నిన్న వున్నది నేడు లేదు .
      నేడు వున్నది రేపు వుండటం లేదు .

      అంటే ఈ ప్రపంచంలో ఏదీ వున్న ఆకారాన్ని గాని , నామధేయాన్ని గాని ఎన్నాళ్ళో కొనసాగించలేదు అని మనకు స్పష్టంగా అవగతమౌతున్నది . ఒక్క ప్రాణులే కాదు , వస్తువులు కూడా . కారణాలు ఏవైనా కావచ్చు .

      మఱి రామాయణం ఈ నాటిది కాదు కదా ! త్రేతాయుగ కాలం నాటిది . కనుక కాలక్రమంలో పేర్లు మారి వుండవచ్చు కదా !

      చరిత్రను నమ్ముతారు కదా ! మఱి చరిత్ర అంటే గతమే కదా ! .

      మొన్న మొన్నటి వరకు బొంబాయిగా చలామణి అయినదాన్ని యిప్పుడు ముంబై గా పేరు మార్చారు .
      పూనాగా పిలవబడ్తున్న దానిని పూణైగా మార్చారు .
      చెన్నపట్టణంగా పిలవబడినదానిని మద్రాసు గా మార్చారు మళ్ళీ దానిని శెన్నైగా మార్చారు .
      ఇలా కాలక్రమంలో కొన్ని కొన్ని మార్పులు సర్వ సహజమౌతూ వుంటాయి .
      మనకు తెలుసు ఈ విషయాలన్నీ . మఱి మన ముందు తరాల వాళ్ళు మీలాగా " అవన్నీ కల్పనలే " అంటే అది నిజం కాదు కదా !

      రేపు మన గురించి ముందు తరాల వారు చెప్పుకొంటుంటారు . అదీ కల్పనలే అని ఎవరైనా అనుకొంటే నిజం కాదు కదా !

      కనుక కొన్ని నమ్మాలి ఈ కోణంలో ఆలోచన చేస్తున్నప్పుడు .

      మీరు నమ్మనంటే మిమ్మల్ని బలవంతం చేయను .

      నాకు తెలిసిన విషయాలు కొంతమందితో పంచుకోవాలని మాత్రమే ఈ టపా వుద్దేశం .

      Delete
  2. మంచి సేకరణ.
    సీతాదేవి భూమిలో ఐక్యమైన ప్రదేశం బితూర్ కాదండి. అది ప్రయాగ దగ్గర ఉన్న సీతామఢి.
    ప్రయాగ నుండి కాశీ వెళ్ళే రహదారిపై ఉంటుంది. నేను గతంలో ఆ ప్రాంతాన్ని సందర్శించాను.

    ReplyDelete
    Replies
    1. వాస్తవానికి నేనూ చూశాను 2007 లో , మఱచాను 2015 లో .

      సవరణలకు స్వాగతం .

      Delete