కట్టు - బొట్టు - కట్టుబాట్లు

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

ఆడపిల్లలకు చిన్నతనంలో  స్కర్ట్స్ , మిడ్డీస్ , స్లీవ్లెస్స్ గౌన్స్ లాంటివి వేస్తుంటారు .

ఆ తర్వాత కొంచెం 10 , 12 ఏళ్ళ వరకు పరికిణీ , జాకెట్ వేస్తుంటారు .

ఆ తర్వాత ప్రధమ రజస్వల కాగానే , ఓ మూల కూర్చోపెట్టి 4 రోజులపాటు ఎక్కడకి వెళ్ళకుండా చేసి , తెలిసిన వారిని , బంధువులను పిలచి , ఓ వేడుకగా జరుపుతారు .
ఇందులోని అంతర్భావం ఏమిటంటే , మా అమ్మాయి పెద్దమనిషి అయింది , మీకు తెలిసిన యిలాకాలో   ఏవైనా మంచి  పెళ్ళి సంబంధాలుంటే  తెలియచెప్దురు అని .
ఈ తతంగంతో ఆ ఆడపిల్లకు వయసు ప్రభావంతో , అదనపు ఆకర్షణలుగా అగుపించే ఆ అవయవ సంపదను భద్రపరిచే సదుద్దేశంతో వస్త్రవిధానం మారుస్తారు , పరికిణీతో పాటు , జాకెట్ కొంచెం పైకి కట్టిస్తూ , ఓణీ ఒకటి అదనంగా కట్టిస్తారు . 

అలా ఆ అమ్మాయిని ఎవరైనా చూస్తే , ఆ అమ్మాయికి వయసొచ్చిందని , ఆ పిల్లను పెళ్ళి చేసుకొనటానికి ఇంకొంచెం ముందుకొస్తారని అంతర్భావన .

అలా ఆ ఆడపిల్లలకు వివాహం చేసినప్పుడు , ఇంకొన్ని అదనంగా తగిలించి , బాధ్యతలుగా ఆనందిస్తారు   . అవేమిటంటే పెళ్ళి . ముందు జీవితానికి ఇదొక ముఖ్యమైన ఘట్టం . ఈ ఘట్టంలో బంధువులను , పరిచయస్తులను పిలుచుకొని , అలా ఆ అందరి ఎదుట ఈ పెళ్ళి కార్యక్రమం జరిపించి , ఆశీర్వచనాలు కోరటంలో గల విశేషం ఏమిటంటే , ఈ యిరువురు భార్యాభర్తలు . వీళ్ళు దగ్గరయేటందులకు వయసు అవసరాలు తీర్చుకొనేటందులకు ,ఈ పెళ్ళి వారధి కాగలదు , ఈ యిరువురిని ఎవరూ ఎక్కడ , ఎప్పుడూ అభ్యంతర పెట్టకూడదు . ఈ యిరువురు , ఒకరికి తెలియకుండా , ఒకరు వేరొకరితో ఆ వయసు సంబంధాలు పెట్టుకొంటే , అది మనమెవ్వరం ప్రోత్సహించ కూడదు అని , ఇంకా ఈ యిరువురిలో మనస్పర్ధలు తలెత్తితే , మీరందరూ సాక్షిగా నిలచి , తగు న్యాయం చేయాలని . 

ఇక ఈ పెళ్ళి తతంగంలోని అంతరార్ధం ఏమిటంటే ,

వరుడికి అంతకుముందే ఉపనయనం జరిగివుంటే , 3 దారాలు కలిపి ముడివేసిన ఒక యజ్ఞోపవీతం వేసుకొని ఉన్నట్లయితే ,యిపుడు అలాంటివి 3 ( మొత్తం )అతనికి ఎడమ భుజము నుండి కుడి నడుము వరకు వచ్చేలా వేస్తారు . దానితో అతను భవిష్యత్తులో ఏ ఆడపిల్లను చూసి మనసు పడ్డప్పుడు , నీకు పెళ్ళైంది , నువ్వు ఎలాంటి దురాలోచనలు చేయకూడదు , తప్పు అని తెలియచేసేటందులకే ఆ యజ్ఞోపవీతం .అంతేగాని వీపు దురద పెడ్తున్న ప్పుడు ( వీపు గోక్కోవటానికి వీలుపడని ప్రదేశం కనుక ) గోక్కోవటానికి కాదు అని అర్ధం చేసుకోవాలి .

ఇక వధువు విషయానికొస్తే , ఆ పెళ్ళి పేరుతో ఆమె మెడలో తాళి ( మంగళసూత్రం ) కట్టటానికే తలవంచ మన్నట్లుగా తలవంచి కడ్తాడు వరుడు . అంటే నువ్వు అతని వద్ద తలవంచి తీరాల్సిందేనని నోటితో చెప్పకనే చెప్తారు ఇలా క్రియా రూపంలో . ఆ వధువుకి కూడా నీకు పెళ్ళైనది , భర్త వున్నాడు , నీ కోరికలను , కష్టసుఖాలను అతనితోనే జరుపుకోవాలి ,అందుకోవాలి , మరెవ్వరితో పాలు పంచుకోకూడదు అని గుర్తుచేయటానికేఆమె మెడలో ఆ తాళి కట్టబడ్తుంది . కాళ్ళకు మెట్టెలు పెట్టిస్తారు వరుడి చేత . ఇంకా వాళ్ళ వాళ్ళశక్తిని బట్టి ఆభరణాలు కూడా పెడ్తుంటారు .

ఇవన్నీ కూడా ఆడవాళ్ళను ( వంటింటికే పరిమితం చేయటం వలన ) ఆకర్షించటానికి వుపయోగించబడిన అస్త్రాలు .ఐతే ఇలా ఆకర్షించటంలో స్వార్ధ చింతన కూడా యిమిడి ఉంది .

ఆడవాళ్ళ శరీర సౌష్టవం  అందానికి , ఓర్పుకి , నేర్పుకి ప్రతీక

మగవాళ్ళ శరీర సౌష్టవం  మొరటుతనానికి ప్రతీక .

అందువలన సంపాదించే పనులు మగవాళ్ళు తీసుకొని , ఆడవాళ్ళకు అలా సంపాదించి తెచ్చి ఇచ్చే ఆ సంపాదనను , పిల్లలని జాగ్రత్తగా చూసుకోమని అప్పజెప్పారు . అంతే కాకుండా తమ ఆడవాళ్ళ అందాలను ఎవరూ దోచుకో కూడదని వంటింటిలోనే బంధించారు . అలా బంధిస్తూ ఈ ఆభరణాలను ఎఱ చూపారు . సహజంగా స్త్రీ తన అందాన్ని పెంపొందించుకోవాలని తాపత్రయపడ్తుంటుంది ( తను అందంగా లేకపోయినా / ఉన్నా ) . అలా ఆ అందాలతో తన భర్తను ఆకర్షించి , ఆనందాలని అందించాలన్న ఆలోచనలతో ఆ చట్రంలో యిరుక్కుపోయింది .

ఇంకా యిలాంటి కొన్ని చిరు కార్యక్రమాలు , ఆ యిరువురిలో నున్న బెరుకును పోగొట్టి వారిని దగ్గర  అయేలా చేస్తాయి .

రెసెప్షన్ సమయంలో ఒకరి ఎంగిలి ఇంకొకరికి తినిపిస్తారు అందరి ముందు . అంటే అందరిలో ఎంగిళ్ళు మొదలెట్టాం ,అంగిళ్ళు అక్కడ చూసుకోవచ్చు అని తెలియచేస్తుంది ఈ కార్యక్రమం .

పెళ్ళి కాగానే , పెద్దలందరి వద్దకు ఈ యిరువురిని తీసుకువెళ్ళి ఆశీర్వదించమని కోరతారు .

ఆ తర్వాత అత్తవారింటికి పంప బోయే కార్యక్రమమే అప్పగింతలు . అంటే ఇన్నేళ్ళు గారాబంగా మా అందరితో  కలసి పెరిగిన ఈ పిల్లను మీకు అప్పజెప్తున్నాం , జాగ్రత్తగా చూసుకోండి అని అర్ధమన్న మాట . ఇలా చేయించే టప్పుడుఅమ్మాయి నడుముకి ఓ మానెడు ( 2 కిలోలకు పైన కొంచెం )బియ్యం పోసి ఓ తెల్ల తుండుగుడ్డతోకట్టి , ఆ నవ దంపతులను ,అక్కడ వున్న యిరు పెద్దలకు వంగి నమస్కారం చేయిస్తారు . అంటే నువ్వు ముందు ముందు గర్భవతివి అవుతావు , అప్పుడు నీవు కడుపుతో ఉన్నా ఇంటెడు చాకిరీ చేయాలి .అందులో తప్పు లేదు అని తెలియ చెప్పటం .

ఆ పై దంపత్తాంబూలాలంటూ ఆ నవ దంపతుల చేత అక్కడ వున్న దంపతులకు యిప్పిస్తారు . ఆ తర్వాత అక్కడే ఓ చిన్న వుయ్యాల వేసి , ఓ చక్క బొమ్మను పెట్టి , ఆ నవ దంపతులచేత ఉయ్యాలూపిస్తారు . అంటే మీ 
యిరువురకు భవిష్యత్తులో  పిల్లలు పుడ్తారు , ఆ పిల్లల్ని మీరిరువురూ పెంచాలి అని అర్ధం .

ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం , ఓ పళ్ళెంలో నీళ్ళు , పసుపు ,కుంకుమ కలిపి ఎఱ్ఱనీళ్ళుగా చేసి ఆ నీళ్ళలో ఆవధువు చేతులు ముంచి , భర్తకి , అత్త మామలకు , ఆడపడుచులకు , తోడికోడళ్ళకు , బావ మరదులకు అద్దించి అప్పజెప్తారు . అంటే మా అమ్మాయిని మీ అందరి చేతులలో పెడ్తున్నాను , కష్టం రాకుండా చూసుకోండి అని .

అలాగే 16 రోజుల పండగ వరకు తొలి రాత్రి కార్యక్రమాన్ని జరిపించేవారు కాదు . దానికి కారణం ఈ లోపల ఎవరు యిష్టపడకపోయినా , దూరమైపోవచ్చన్న అంతర్భావన ఆ పెద్దల మనసుల్లో వుంచుకొని ఇలా నడచుకొనేవారు .

ఏ పెళ్ళయిన జంటకైనా ఆ మొదటి సంవత్సరంలో ఆషాఢమాసం వస్తుంది . అపుడు కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళటం , అక్కడకి అల్లుడు రాకుండా  ఆ గడప దాటకుండా , అత్తా అల్లుడు , ఒక యింటిలో వుండకూడదని ఓ ఆచారాన్నిసృష్టించారు .ఎందుకంటే కొత్తగా పెళ్ళైన ఆ జంట అంతకు మునుపే దాంపత్యం రుచి చూసిన వారవటంతో, ఆ నవ వధువులకు ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ పొంగిపొరలాలని .

అయితే యిపుడు ఆ పెద్దలు చేసే పెళ్ళిళ్ళు లేవు  , యిప్పుడు దాటకూడని గడపలు లేవు , అన్నీ లాడ్జింగులే కదా ! కనుక యిపుడా సమస్యలే లేవనుకోండి .

ఇవి అన్నీ సద్భావనలే . తెలిసినవారెందరు ? తెలుసుకొని మసులుకొంటే జీవితమే ఆనందమయమే కదా ! 

                                                                                                        ******

2 comments:

  1. వక్ర భాష్యాలు.

    ReplyDelete
    Replies
    1. అలా అని సరిపెట్టుకోవటం మీలాంటి వారికి సరిపోతుంది . నిజాల్ని జీర్ణించుకోవటం అందరివల్లా కాదు లెండి .

      Delete